దేవుళ్లు మన కంటికి కనిపించరు.. కానీ మన కంటికి కనిపించే దేవుళ్లు మాత్రం డాక్టర్లు అంటారు పెద్దలు. కరోనా సమయంలో వారు దానిని నిరూపించారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడి తమ వైద్య వృత్తికి న్యాయం చేశారు. ఆ డాక్టర్ల యొక్క నిజ జీవితాలను మన కళ్ల ముందుంచే ప్రయత్నమే ‘డాక్టర్ సాబ్’ మూవీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్పై డి.ఎస్.బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘డాక్టర్ సాబ్’ మూవీలో శోభన్ హీరోగా నటిస్తున్నాడు. నిత్యం డాక్టర్లు ఎదుర్కొనే ఇబ్బందులు, పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. దీనికి అమ్మపండు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సనిమా గురించి ఎస్.పీ వివరాలను తెలియజేశారు.
తన స్నేహితుడు డి.ఎస్.బి ఈ కథను రెడీ చేశాడని.. స్క్రిప్ట్ బాగా కుదిరిందని తెలియజేశాడు. ఇటీవల ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.. అనుకున్నది అనుకున్నట్లు తీశామని.. మరో షెడ్యూల్ను తర్వలోనే ప్లాన్ చేస్తామన్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను ఎంత వీలుంటే అత త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది తమ ప్రయత్నమన్నారు.
ఈ సినిమాలో ఫైట్స్, డ్యాన్స్ ల విషయంలో హీరో శోభన్ ఎక్కడా తగ్గలేదని.. ట్రైనింగ్ తీసుకొని మరీ కష్టపడి చేశాడని ప్రశంసించాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను రెండు నెలల క్రితం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అన్ని రకాల ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ గా ఎం మురళీకృష్ణ పనిచేస్తుండగా.. పాటలు నర్సింగరావు అందిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…