Categories: Featured

పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ పై జనాలు ఏమంటున్నారంటే ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఏకే రీమేక్ ని,వీరమల్లు సినిమాలని పూర్తి చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు.. వకీల్ సాబ్ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉండగా బాలీవుడ్ లోని పింక్ సినిమా కి ఇది రీమేక్..

ఇక అయన రాజకీయ విషయాల కొస్తే జనసేన బీజేపీ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుంది. దానివల్ల జనసేన మిస్ అయ్యింది అని చెప్పాలి. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేసిన బీజేపీ పార్టీ జరగబోయే తిరుపతి ఎన్నికల్లో సైతం పోటీ చేయనీయకూడదని చూస్తుంది.. ఇక స్థానిక ఎన్నికల్లో జనసేన హవా చూపిస్తుంది.. అనుకున్న సీట్లకన్నా ఎక్కువ స్థానాల్లో జనసేన గెలవడంతో జనసేన లో ఆశలు చిగురిస్తున్నాయి.. ప్రజల్లో పవన్ కళ్యాణ్ పై ఇంకా నమ్మకం ఉందని ఈ ఎన్నిక గుర్తిస్తుంది..

ఇక పాలిటిక్స్ అంటేనే ఎంత కమర్షియల్ రంగమో అందరికి తెలిసిందే. అడుగు తీసిన అడుగు వేసినా పైసానే మాట్లాడుతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నమైన రాజకీయం చేస్తున్నారు. జీరో బడ్జెట్ రాజకీయాలతో ముందుకు వెళుతూ ఇతర రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇది ఎంతో మంచి పరిణామమని అంటున్నారు ప్రజలు.. డబ్బు లు వెదజల్లి ఓట్లు కొనుకుంటున్న పార్టీ లు ఉన్న ఈరోజుల్లో ఇలా ప్రజల మనసుని దోచుకుని జనసేన ఓట్లు సంపాదించడం ప్రజల్లో మార్పు రావడమే అని అంటున్నారు. మరి ఇలానే చేసి జనసేన పార్టీ వచ్చే ఎన్నికల వరకు ఈమేరకు బలపడుతుందో చూడాలి.

 

 

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago