Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, మంత్రి పవన్ కళ్యాణ్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన తరచూ ఆలయాలకు వెళ్లడమే కాకుండా ఎన్నో రకాల పూజలు హోమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు.
ఈ విధంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారాహి అమ్మవారి దీక్ష వేసిన సంగతి మనకు తెలిసిందే. 11 రోజులపాటు ఈ దీక్షలో ఈయన ఎంతో నియమ నిష్టలను పాటిస్తూ ఈ దీక్షను పూర్తి చేశారు. ఇక ఈయన దీక్ష నేటితో పూర్తి కావడంతో దీక్ష విరమణ చేశారు.
వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ పవన్ కళ్యాణ్వా రాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతితో పాటు నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణం అయ్యింది.
వారాహి అమ్మవారు..
ఇలా 11 రోజులపాటు ఈ దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంతో విజయవంతంగా ఈ దీక్షను పూర్తి చేశారు. ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా కేవలం పండ్లు ద్రవాలను మాత్రమే తీసుకుంటూ ఈ 11 రోజులపాటు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఈయన దీక్షలో ఉన్నారు ఇక నేటితో ఈ దీక్ష పూర్తి అయ్యింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…