కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పెన్షన్ తీసుకునే వాళ్లకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ శుభవార్త చెప్పింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ సబ్స్క్రైబర్ల కొరకు పీఎఫ్ఆర్డీఏ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా పీఎఫ్ఆర్డీఏ తెచ్చిన మూడు ఆన్ లైన్ సర్వీసుల ద్వారా నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరిన వారికి ప్రయోజనం చేకూరనుంది.
పీఎఫ్ఆర్డీఏ నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్స్క్రైబర్ల కొరకు డి రెమిట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చి్ది. డి రెమిట్ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వల్ల నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతా నుంచి డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. బదిలీ చేసిన రోజే నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్ స్క్రైబర్లను నెట్ అస్సెట్ వాల్యూ ద్వారా సెటిల్మెంట్ జరుగుతుంది. డి రెమిట్ ఫెసిలిటీ ద్వారా ఎన్పీఎస్ సబ్ స్క్రైబర్లు డబ్బులను సిప్ రూపంలో సైతం ఇన్వెస్ట్ చేయవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ సిప్ మాదిరి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండటం ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లకు ప్రయోజనం చేకూరుతుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సిగ్నేచర్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నామినీని మార్చుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నామినీ పేరును మార్చుకునే అవాకాశాలు ఉన్నాయి. వీటితో పాటు కస్టమర్లకు ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఆన్లైన్ వీడియో బేస్డ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ను కూడా పీఎఫ్ఆర్డీఏ అందుబాటులోకి తీసుకురావడంతో ఇకపై మరింత సులభంగా డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పీఎఫ్ఆర్డీఏ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సర్వీసుల వల్ల నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో చేరిన వారికి ప్రయోజనం చేకూరుతుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…