మామూలుగా మనం ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ పోలీసుల కోసం ధరించడం కాకుండా మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ధరించాలి. ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజలు ఏమాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు.ఈ విధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వారికి పోలీసులు జరిమానా విధించడం మనం చూస్తుంటాము. ప్రజలకు జరిమానా విధించిన పోలీసులు సైతం కొన్నిసార్లు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. మరి వారికి జరిమానా విధించరా.. అంటూ సామాన్యులు ఎన్నోమార్లు ప్రశ్నించారు.
తాజాగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉన్నటువంటి పోలీసులకు కూడా గట్టి దెబ్బ తగిలింది. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న 27 మంది పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది.జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రధాన కూడళ్ల వద్ద, పోలీస్ క్వార్టర్స్ దగ్గర భారీ ఎత్తున మోహరించారు.
ఈ క్రమంలోనే హెల్మెట్లు లేకుండా బయటకు వచ్చిన 27 మంది పోలీసులకు అక్కడే జరిమానా విధించి డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా ఒక్కరోజులోనే 27 మంది పోలీసులకు జరిమానా విధించిన ట్రాఫిక్ డీఎస్పీని.. ఎస్పీ అభినందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం తప్పుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. కేవలం హెల్మెట్ ధరించని 27 మంది పోలీసులు మాత్రమే కాకుండా, హెల్మెట్ ధరించనీ సాధారణ ప్రయాణికులకు వంద మందికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించినట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…