Featured

Political Analist K.S. Prasad : వివేకానంద రెడ్డి హత్యకు నవీన్ కు మధ్య లింకేంటి?? ఎవరీ నవీన్, అసలు ఏంటి కథ…: పొలిటికల్ అనలిస్ట్ కే.ఎస్ ప్రసాద్

Political Analist K.S. Prasad : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణకు కేసును సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ కేసు ఎన్ని రోజులుగా నత్తనడకన సాగుతున్నా ప్రస్తుతం ఒక ఫోన్ కాల్ లీక్ తో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ విషయాల మీద పొలిటికల్ అనలిస్ట్ కే.ఎస్ ప్రసాద్ విశ్లేషించారు.

నవీన్ ని కావాలని ఈ కేసులో పెడుతున్నారు…

ప్రసాద్ గారు మాట్లాడుతూ వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసు నాలుగేళ్లు సాగదు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ, కేసు మొదట్లోనే సరిగా పోలీసులు పనిచేసుంటే ఈపాటికి కేసు ముగిసేది. అపుడు పట్టించుకోకున్నా ఇపుడు ఈ కేసులో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తే ఏమీ ఒరగదు అంటూ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. డైలీ సీరియల్ లో జనాలకు బోర్ కొడుతోంది అన్న సమయంలో కొత్త పాత్రను తెర మీదకు తెచ్చినట్లు ఇపుడు ఈ కేసులో నవీన్ అనే క్యారెక్టర్ ను ఎంటర్ చేసారు. ఒక సెలబ్రిటీనో రాజకీయ నాయకుడో బిజీ ఉన్నాడు అంటే అతని వద్ద పనిచేసే డ్రైవర్ అలా ఎవరో ఒకరి నెంబర్ కి కాల్ చెస్తారు కావలిసిన వాళ్ళు అది సాధారణంగా జరిగే విషయమే. అతనికి కాల్స్ వెళ్లాయని ఇక అతనికి ఈ హత్యకి సంబంధం ఏమిటి అంటూ అరా తీయడం విడ్డూరంగా ఉంది. అసలు ఏ కేసులో ఎవరిని విచారించాలో అందరికీ తెలుసు, వారిని పట్టుకుని ప్రశ్నిస్తే కేసు క్లోజ్ అవుతుంది కానీ అలా చేయరు. ఇలా కేసు సాగదీస్తూనే ఉంటారు.

ఈ కేసు వల్ల జగన్ కి జరిగే ప్రమాదం ఏమీ లేదు కేవలం వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత తిరుగుతున్నారు అంతే అంటూ చెప్పారు ప్రసాద్. ఇక చంద్రబాబు ఇపుడు ఈ హత్య మీద ఆరోపణలు చేయకుండా అధికారంలో ఉన్నపుడే వివేకానంద రెడ్డిని హత్య మీరే చేశారు అంటూ నరకాసుర హత్య అని హెడ్డింగ్ పెట్టిన పత్రికల వాళ్ళను, ఆ ఆర్టికల్ రాసినవారిని ఆరోజే పోలీస్ స్టేషన్ లో విచారించి ఉంటే బాగుండేది. ఏ ఆధారాలతో అలా రాసారు అని నిలాదీసుంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డారు. ఇక ఈ కేసులో కొత్త పేర్లు వినిపిస్తూ కొత్తమలుపులు తిరగడమే కానీ కేసులో అసలు దోషులు తేలరు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

15 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

15 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

15 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

15 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

15 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

15 hours ago