ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే కాంబో మరొకసారి రిపీట్ కానుందని చిత్ర బృందం ప్రకటించారు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్సింగ్”అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు.
అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ అఖిల్ పూజా హెగ్డే నటించినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ… హీరో అఖిల్ ని అభినందించిన ఆయన పూజాహెగ్డేను మాత్రం ప్రత్యేకంగా అభివర్ణించాడు. కరోనా సమయంలో అందరూ ఖాళీగా ఉన్నప్పటీకీ పూజ మాత్రం ఎంతో బిజీగా ఉన్నారని శంకర్ పూజ గురించి తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈమె వరుసగా అఖిల్, బన్నీ, చెర్రీ, పవన్ కళ్యాణ్, మహేష్ అంటూ టకటక హీరోల పేర్లు చెబుతూ నోరు జారారు. తనకు తెలియకుండానే పవన్ కళ్యాణ్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోందన్న విషయాన్ని డైరెక్టర్ శంకర్ బయటపెట్టారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ వేడుకలో డైరెక్టర్ హరీష్ శంకర్ అధికారికంగా తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…