దక్షిణాది చిత్రపరిశ్రమతోపాటు బాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్గా మారుతున్నారు కథానాయిక పూజాహెగ్డే. ఇప్పటికే ఆమె నటించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల అయి మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఆమె గ్రాఫ్ మరింతగా పెరిగిందనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. పండగ సీజన్ ను క్యాష్ చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే వైజాగ్ లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. తర్వాత హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. అతడు మాట్లాడుతూ.. ‘‘తనకు ఒక్కరికే పూజా హెగ్డే ప్రత్యేకం అనుకున్నా.. కానీ అందరి హీరోలకీ స్పేషలే’’ అంటూ చెప్పుకొచ్చాడు. అఖిల్ కు మంచి హిట్ లభించిందని.. తనకు అతడు తమ్ముడు లాంటివాడు అంటూ చెప్పాడు. మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడని కితాబిచ్చాడు.
అంతే కాకుండా లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్యకు కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. ముకుంద సినిమా నుంచి పూజా హెగ్డే వైవిద్యమైన కథలతో ముందుకు వెళ్తోంది అంటూ చెప్పాడు. ఈ చిత్రంతో ఆమె మరో అడుగు ముందుకు వేసిందని చెప్పాడు. ఆమె ఏ హీరోతో నటించినా హిట్ గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…