పవన్ కళ్యాణ్ పై ఇటీవల విలేకరుల సమావేశం పెట్టి మరీ పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో వివాదస్పదంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా దూషింగచడంతో పవన్ ఫ్యాన్స్ అతడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రెస్ క్లబ్ బయట ఉన్నప్పుడే కొందరు పోసానిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా.. పోసాని ఇంటిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. హైదరాబాద్ యెల్లారెడ్డిగూడలో పోసాని ఇంటి వద్ద అర్ధరాత్రి 2 గంటలకు దాడి జరిగినట్లు సమాచారం. ఇక పోసాని నివాసంలోని కొన్ని అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో వెంటనే అప్రమత్తం అయిన పోసాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సోషల్ మీడియాలో అనేక రకాల ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇంటి పై దాడి తర్వాత పోసాని కనిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అతడు ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు.
అక్కడ షూటింగ్ కు కూడా అతడు అందుబాటులో లేడని సమాచారం. అయితే అతడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేదా ఎక్కడికైనా వెళ్లారా అనేది తెలవడం లేదు. ఫోన్ కూడా స్విఛ్చాఫ్ కావడంలో అతడి సన్నిహితులు, కుటుంబభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఇటు నిర్మాతలు కూడా ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోసాని కనిపించడం లేదన్న వార్త వైరల్ గా మారింది. కాంబినేషన్ షూటింగులకు అంతరాయం కలుగుతోందంటూ నిర్మాతలు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…