పవన్ కళ్యాణ్ పై ఇటీవల విలేకరుల సమావేశం పెట్టి మరీ పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో వివాదస్పదంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా దూషింగచడంతో పవన్ ఫ్యాన్స్ అతడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రెస్ క్లబ్ బయట ఉన్నప్పుడే కొందరు పోసానిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉండగా.. పోసాని ఇంటిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. హైదరాబాద్ యెల్లారెడ్డిగూడలో పోసాని ఇంటి వద్ద అర్ధరాత్రి 2 గంటలకు దాడి జరిగినట్లు సమాచారం. ఇక పోసాని నివాసంలోని కొన్ని అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో వెంటనే అప్రమత్తం అయిన పోసాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సోషల్ మీడియాలో అనేక రకాల ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇంటి పై దాడి తర్వాత పోసాని కనిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అతడు ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు.
అక్కడ షూటింగ్ కు కూడా అతడు అందుబాటులో లేడని సమాచారం. అయితే అతడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేదా ఎక్కడికైనా వెళ్లారా అనేది తెలవడం లేదు. ఫోన్ కూడా స్విఛ్చాఫ్ కావడంలో అతడి సన్నిహితులు, కుటుంబభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఇటు నిర్మాతలు కూడా ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోసాని కనిపించడం లేదన్న వార్త వైరల్ గా మారింది. కాంబినేషన్ షూటింగులకు అంతరాయం కలుగుతోందంటూ నిర్మాతలు చెబుతున్నారు.
































