General News

మంత్రాలతో డబ్బులు వర్షం కురిపిస్తున్న మాంత్రికుడు.. చివరికి ఏమైందంటే?

ప్రస్తుతం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో కొందరు మోసగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజుకు దొంగ బాబాలు, మంత్రగాళ్లు ఎక్కువై పోతున్నారు.ఈ క్రమంలోనే ఓ మంత్రగాడు వారిని టార్గెట్ చేసుకుని అతని దగ్గర నుంచి ఏకంగా 52 లక్షల రూపాయలను లూటీ చేసిన ఘటన పూణేలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కిసాన్ పవార్ (45) అనే వ్యక్తి తాను మంత్రికుడినంటూ 2016లో ఓ వ్యాపారితో పరిచయం ఏర్పరచుకున్నారు. వ్యాపారి కనిపించిన ప్రతిసారి చిన్న చిన్న మ్యాజిక్ లుచేస్తూ వ్యాపారికి తనపై నమ్మకం పెంచుకున్నాడు. తనకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని, తను ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మించాడు. ఈక్రమంలోని తనకు తెలిసిన మంత్ర విద్యలు ద్వారా తనకున్న కష్టాలన్నీ తొలగిస్తానని చెబుతూ అప్పుడప్పుడూ ఆ వ్యాపారి నుంచి డబ్బులు లాగే వాడు.

ఈ క్రమంలోనే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఆ వ్యాపారి నుంచి డబ్బులు తీసుకోవాలని పథకం వేసిన కిసాన్ పవర్ అనే మంత్రగాడు తనకు మంత్రాలతో డబ్బులు వర్షం కురిపించడం తెలుసని వ్యాపారిని నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆ మంత్రం తనకి నేర్పిస్తానని చెప్పి అతని దగ్గర నుంచి విడతలవారీగా 52 లక్షల రూపాయలను తీసుకున్నాడు. ఈ విధంగా డబ్బులు తీసుకున్న తర్వాత వారిద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి.

ఈ ఈ క్రమంలోనే ఆ వ్యాపారి మంత్రిగాడిని కలిసి తనకు మంత్రం నేర్పించాలనీ కోరినప్పుడు ఈరోజు రేపు అంటూ వాయిదా వేస్తూ తిరిగేవాడు.ఈ క్రమంలోనే ఒకరోజు వ్యాపారి తనకు మంత్రం నేర్పించాల్సింది అని గట్టిగా నిలదీయడంతో అందుకు మంత్రగాడు మంత్రం నేర్పించాలి అంటే తప్పనిసరిగా నరబలి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ క్రమంలోనే అతనిపై అనుమానం రావడంతో ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలోనే పూణే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో వ్యాపారి మాటలు విన్న పోలీసులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో అతను మంత్రగాడు కాదని, చిన్నచిన్న గారడీలు చేస్తే అమాయక ప్రజలను మోసం చేస్తూ వారి దగ్గర నుంచి డబ్బును లాగుతున్నాడు అని ఇటువంటి మోసగాళ్ల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని పుణె ఏసీపీ సురేంద్రనాధ్ దేవ్ ముఖ్ హెచ్చరించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago