Poverty In Telangana and AP: కోరలు చాస్తున్న పేదరికం..ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఏంటంటే..!
Poverty In Telangana and AP: నీతి ఆయోగ్ జాతీయ బహువిధ దారిద్య్ర సూచికలో ఏపీ కన్నా తెలంగాణ వెనకబడి ఉంది. ఆర్థిక, సాంఘిక అసమానతలే తెలంగాణ ఉద్యమానికి కారణమయ్యాయి. తెలంగాణ వచ్చి ఏడేళ్లు గడిచాయి. అయితే చాలా విషయాల్లో తెలంగాణ ఏపీ కన్నా మెరుగ్గానే ఉంది.
ముఖ్యంగా ఆదాయంపరంగా తెలంగాణ, ఏపీ కన్నా ముందే ఉంది. హైదరాబాద్ తెలంగాణకు మెయిన్ ఆదాయ ఇంజిన్ గా పనిచేస్తోంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఏపీకి దూరంగా ఉంది. అయితే ఈ ఏడేళ్ల టైంలో విభజిత ఏపీ కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ పేదరికం ఉన్నదని నివేదికలు పేర్కొంటున్నాయి.
తాజాగా నీతి ఆయోగ్ రూపొందించిన జాతీయ బహువిధ దారి దారిద్య్ర సూచిలో ఈ విషయం తేటతెల్లం అవుతోంది. నీతి ఆయోగ్ జాబితాలో పేదరికంలో మొత్తం 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా… ఏపీ 20 వస్థానంలో నిలిచింది. తెలంగాణలో పూర్వపు 10 జిల్లాలను లెక్కలోకి తీసుకుంటే.. ఆదిలాబాద్ జిల్లా పేదరికంలో మొదటిస్థానంలో ఉంది. నీతి ఆయోగ్ ఈ నివేదికను 2015-16లో తయారైన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వివరాలను పరిగణనలోకి తీసుకుని తయారు చేసింది.
ఈ నివేదిక ఆరోగ్యం, ఫుడ్, విద్యా, లివింగ్ స్టాండర్స్.. ఈ నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించారు. ఇందులో మెరుగైన స్థితిలో ఉన్న రాష్ట్రాలు మంచి స్థానాన్ని సాధించాయి. దేశంలో పేదరికంలో బీహార్ మొదటిస్థానంలో ఉంది. కేరళ పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మెరుగైన స్థానాన్ని సాధించింది. 51.91 శాతంతో బీహార్ రాష్ట్రం అత్యంత నిరుపేద రాష్ట్రంగా ఉందని నివేదిక స్పష్టం చేసిందది. కేరళ 0.71 శాతం పేదరికం ఉన్నట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది. మొత్తంగా నీతి ఆయోగ్ నివేదిక దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 700కు పైగా జిల్లాల్లో ప్రజల స్థితిగతులు, లివింగ్ స్టాండర్డ్స్, పేదరికాన్ని చూపింది.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…