Featured

Prabhas : పెదనాన్న కోసం సొంతూరు వెళ్లనున్న ప్రభాస్, దాదాపు 12 ఏళ్ల తరువాత మొగల్తూరు కి ప్రభాస్..!

Prabhas : సెప్టెంబర్ 11 న కృష్ణం రాజు గారు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించడం అందరికీ తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కూడా హైదరాబాద్ లోనే ప్రభుత్వ లాంచనాలతో జరిగాయి. ఇక ఆయన దశ దిన కర్మ ను ఈ నెల 23 న హైదరాబాద్ లోని నివాసంలో నిర్వహించాలని అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యామిలీ. ఇక ఆయన సంస్మరణ సభను మాత్రం కృష్ణం రాజు గారి సొంతూరు మొగల్తూరు లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఆ సభకు ప్రభాస్ ఫ్యామిలీ అంతా వస్తారని సమాచారం. దాదాపు 12 ఏళ్ల తరువాత ప్రభాస్ సొంతూరుకి పెదనాన్న వల్ల రాబోతున్నాడు.

70,000 మందికి భోజనాలు…

సెప్టెంబర్ 28 న కృష్ణం రాజు గారి సంస్మరణ సభ మొగల్తూరు లోని ఆయన నివాసం వద్ద జరపాలని అనుకుంటున్నారు. 2010 లో ప్రభాస్ తండ్రి కృష్ణం రాజు గారి తమ్ముడు మరణించినపుడు ప్రభాస్ మొగల్తూరు వెళ్లారు. ఆ తరువాత మళ్ళీ వెళ్ళలేదు. అయితే ఇప్పుడు పెదనాన్న కోసం 12 ఏళ్ల తరువాత వెళ్లాలని అనుకుంటున్నారు. ఇక ఈ సభ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

వారి పూర్వికుల నివాసం వద్ద ఇంటికి రంగులు పూయించడం, ఫర్నిచర్ మార్చడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక 70 వేల మందికి భోజనాలు పెట్టాలని అనుకోవడం వల్ల ద్రాక్షారామం నుండి వంటవాళ్ళను కూడా పిలిపించారు. కృష్ణం రాజు గారు బ్రతికి ఉన్నపుడు ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లైనా మొగల్తూరు వెళ్ళి వచ్చేవారట. కరోనా లాక్ డౌన్ వల్ల గత రెండేళ్లుగా ఆయన  మొగల్తూరు వెళ్ళలేదు. ఈ నెల 23 న దశదిన కర్మ అనంతరం 28 న సంస్మరణసభ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరగనుంది.

Bhargavi

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago