Prabhas: సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.అయితే ఇలా సెలబ్రిటీల గురించి వచ్చే వార్తలలో ఒక్క శాతం నిజమైనప్పటికీ మిగతా 99% ఆ వార్తలు అన్నీ కూడా ఆ వాస్తవాలు అయి ఉంటాయి. పోతే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోని ఈయనకు హైదరాబాదులో పలు ప్రాంతాలలో విలువైన ఆస్తులు కూడా ఉండడం సర్వసాధారణం. అయితే ఓ వెబ్సైట్ మాత్రం ప్రభాస్ గురించి ఒక వార్త ప్రచురించింది.
ప్రభాస్ జూబ్లీహిల్స్ లో 84 ఎకరాల ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని ఈ ఫామ్ హౌస్ ఎకరం కేవలం కోటి రూపాయలతో కొనుగోలు చేశారంటూ వార్తలు రాశారు. ఇక ఈ ఫామ్ హౌస్ కి రాధేశ్యామ్ సినిమా నుంచి ఒక ఫోటోని కూడా యాడ్ చేసి పోస్ట్ చేశారు. ఇలా ప్రభాస్ గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ వార్త స్పందించారు.
ఈ సందర్భంగా శోభియార్లగడ్డ స్పందించి ఏంటి నిజమా? జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు అంటే దాని ధర ఎంత ఉంటుందో తెలుసా?ఏదో ఒక చెత్త రాసి దానికి సెలబ్రిటీ పేరును జోడించడం బాగా అలవాటైపోయింది అంటూ తనదైన స్టైల్ లో చురకలు అంటించారు.ఇక ఈ వార్త డైరెక్టర్ మారుతి కూడా స్పందించి ప్రభాస్ విల్లాకు రాధేశ్యామ్ ఇంటీరియర్ డిజైనర్ వాడుతున్నారే అంటూ కామెంట్ చేశారు.ఇలా ఈ దర్శక నిర్మాతలు ఇద్దరు ప్రభాస్ ఫామ్ హౌస్ పై స్పందించి ఇదంతా కేవలం ఆ వాస్తవమని క్లారిటీ ఇచ్చారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…