కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం రైతుల కొరకు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీతో కేంద్రం జతకట్టి ఈ స్కీమ్ ద్వారా కేంద్రం రైతులకు నెలకు మూడువేల రూపాయల చొప్పున పెన్షన్ ను ఇస్తోంది. రైతులు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన యోజన స్కీమ్ కు రైతులు అర్హత పొందాలంటే రైతులు సాధారణంగా కొంత మొత్తం ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇకపై రైతులు ప్రీమియం చెల్లించల్సిన అవసరం లేకుండా కేంద్రం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ లో మార్పులు చేసింది. ప్రస్తుతం దేశంలోని రైతులు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా 6,000 రూపాయలు పొందుతున్న సంగతి తెలిసిందే.
ఇకపై కేంద్రం పీఎం కీసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ లో చేరిన రైతుల ప్రీమియాన్ని పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా పొందే నగదుకు బదులుగా చెల్లించనుంది. తద్వారా రైతులు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా లభించే ఆరువేల రూపాయలు వృద్దాప్యంలో నెలకు 3 వేల రూపాయల చొప్పున పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు ఇకపై ఏ రైతు కూడా ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సును బట్టి 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దేశంలోని 21 లక్షల మంది రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…