Prathap Pothen : సినీ ఇండస్ట్రీ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన ప్రతాప్ పొతెన్ తుది శ్వాస విడిచారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం విగత జీవిగా వున్నారు ఆయన. ఉదయం పని చేయడానికి పనిమనిషి వచ్చాక ఆయన మరణ వార్త అందరికీ తెలిసింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈయన మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
మలయాళంలో మొదట తన ప్రస్తానాన్ని మొదలు పెట్టి…
ప్రతాప్ పొతెన్ మొదట మలయాళం లో తన సినీ ప్రస్తానాన్ని ‘ఆరవం’ అనే సినిమాతో ప్రారంభించాడు. ప్రతాప్ మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటించాడు. నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, రచయితగా కూడా అభిమానులకు చేరువ అయ్యాడు. సినీ నటి రాధిక మొదట ప్రతాప్ ని 1985 లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వళ్ల వీరు వారి దాంపథ్య జీవితాన్ని కొంసాగించలేకపోయారు. పెళ్ళి అయిన ఒక సంవత్సరానికే అంటే 1986 లో విడాకులు తీసుకోవడం జరిగింది.
మలయాళం లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతాప్ చివరిగా మమ్ముటీ హీరోగా తెరకెక్కిన ‘సీబీఐ5 ది బ్రెయిన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో విడుదల అయింది. ఈయనకు తెలుగులో ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రతాప్ పొతెన్ మృతి తో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేసారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…