Yedu Kondalu : జబర్దస్త్ వివాదంలో ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీనంతటికి మొదట ఆజ్యం పోసింది మాత్రం కిర్రాక్ ఆర్పినే. జబర్దస్త్ గురించి, మల్లె మాల గురించి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి తీవ్ర వాఖ్యలు చేసాడు. దీంతో జబర్దస్త్ నుండి కొంతమంది కిర్రాక్ ఆర్పి వాఖ్యలను ఖండించడానికి సోషల్ మీడియాలో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడు కొండలు కూడా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చి జబర్దస్త్ లో విషయాల గురించి కిర్రాక్ ఆర్పి గురించి సంచలన వాఖ్యలు చేసాడు.
శ్యామ్ గారి గురించి తప్పుగా మాట్లాడటంతో మెడ పట్టి బయటకు గెంటేసా…
కిర్రాక్ ఆర్పి చేసిన విమర్శలను ఏడు కొండలు తప్పుబట్టారు. అన్నం పెట్టిన సంస్థను తిట్టడం చాలా తప్పు అంటూ అన్నారు. ఒక సినిమా తీస్తున్నానని ఆ సినిమా కోసం మేనేజర్ గా పనిచేయమని అడిగితే వెళ్ళాను, నెలకు యాభైవేలు జీతం ఇస్తానని చెప్పాడు. కొన్ని రోజుల తరువాత ఆర్పి తీరు నచ్చలేదు. ఈ సినిమా ముందుకు సాగదు అని అర్థమైంది దాంతో నేను మానేసాను.
అది కాక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడటం నాకు నచ్చలేదు దాంతో వాడిని మెడబట్టి బయటకు గేంటేసాను అంటూ ఏడుకొండలు చెప్పారు. ఇక జబర్దస్త్ లాంటి వేదిక మీద వీళ్లకు జీవితాలు మెరుగుపడ్డాయి. అలాంటిది కిర్రాక్ ఆర్పి లాంటి వాడు శ్యామ్ ప్రసాద్ గారిని తిట్టడని అంటూ ఫైర్ అయ్యారు ఏడు కొండలు. చివరకు మళ్ళీ జబర్దస్త్ మొఖం చూడాల్సిందే, వేరే చానెల్స్ కి వెళ్లినా ఎక్కువ రోజులు పని చేయలేరు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…