సుకుమార్ దర్శకత్వంలో సమంత రామ్ చరణ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “రంగస్థలం”. అప్పటివరకు క్లాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ “రంగస్థలం” సినిమా ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ ని బయట పెట్టాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో,అచ్చం పల్లెటూరి యువకుడిలా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా తర్వాత నటుడు రామ్ చరణ్ కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా లోజగపతిబాబు విలక్షణ నటుడి పాత్రలో అద్భుతంగా చేశారు. అదేవిధంగా ఆది పినిశెట్టి రంగమ్మత్త పాత్రలో అనసూయ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అయ్యాయని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
పృధ్విరాజ్ దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తిచేశారు. అదేవిధంగా తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పినప్పటికీ, కొన్ని కారణాల వల్ల పృథ్వీరాజ్ పాత్రను ఎడిటింగ్ లో తీసేసారనీ తాజాగా పృథ్వి రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అసలు ఈ సినిమా షూటింగ్ మొత్తం చెప్పి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ సన్నివేశాలు తొలగించడానికి కారణం ఏంటి అనే విషయాలను కూడా ఓ ఇంటర్వ్యూలో పృధ్విరాజ్ వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాలో నాపై సన్నివేశాలు అన్నింటినీ తెరకెక్కించారు, నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాను. కానీ అమెరికా నుంచి సుకుమార్ స్నేహితుడు ఈయనను ఎందుకు పెట్టుకున్నారు, ఈయన సినిమాలలో ఉంటే రావు గోపాల్ రావుల అవుతారని చెప్పారట అందుకోసమే నేను నటించిన సన్నివేశాలు అన్నింటిని తీసేశారని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తెలియజేశారు.ఇక ప్రస్తుతం పృథ్వి రాజ్ తెలుగు తమిళ సినిమాలలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…
టాలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…