Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. దీంతో ఈ అమ్మడు గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు పొందింది. ఇక నిక్ జోనాస్ తో వివాహమైన తర్వాత హాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యింది.
ఇది ఇలా ఉండగా ఈ అమ్మడు తరచూ గ్లామర్ తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.తరచూ నేషనల్,
ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తోంది.
తాజాగా జరిగిన ఆస్కార్ ఈవెంట్ లో కూడా సందడి చేసింది. ఇక తాజాగా న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో నిర్వహించిన 2023 మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసింది. ఈ ఈవెంట్ లో ప్రముఖ డిజైనర్ వాలెంటినో డిజైన్ చేసిన స్టైలిష్ బ్లాక్ గౌన్ లో మెరిసిపోయింది.
ఇక నిక్ జోనాస్ కూడా స్టైలిష్ గా అదిరిపోయే లుక్ తో స్టార్ జంటగా అందరినీ ఆకట్టుకున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. 2023 మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ధర ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఈ మెట్ గాలా ఈవెంట్లో ప్రియాంక చోప్రా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ను ధరించింది. సాధారణంగా డైమండ్ జ్యువెలరీ విలువ ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రియాంక ధరించిన ఈ నెక్లెస్ ధర తెలిసి సెలబ్రిటీలు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ నెక్లెస్ విలువ ఏకంగా రూ.204 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్రియాంక చోప్రా ధరించిన ఆ నెక్లెస్ ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…