Producer Chittibabu : నందమూరి తారక రత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ సభకు హాజరై అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారక రత్నకు గుండెనొప్పి రావడంతో తనని చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ తెలుస్తోంది. అయితే ఆయన్ను విదేశాలకు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక పూటకో న్యూస్ తో అసలు తారకరత్న విషయంలో ఏం జరుగుతోంది అనే క్లారిటీ ఇవ్వడానికి నిర్మాత చిట్టిబాబు మాట్లాడారు.
బిల్స్ ఎవరు కడుతున్నారంటే…
చిట్టిబాబు మాట్లాడుతూ తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారంటూ చెప్పారు. నారాయణ హృదయాలయలో తనకు మెరుగైన వైద్యం అందుతోందని, ఇండియాలోనే బెస్ట్ డాక్టర్ తో ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పారు. తారక రత్న ఆరోగ్యం గురించి బయటికి వినిపిస్తున్న వార్తలు వదంతులు అంటూ తెలిపారు. తనని విదేశాలకు తీసుకెళ్తున్నట్లు బ్రెయిన్ డామేజ్ అయిందంటూ చెప్తున్న మాటలు వాస్తవం కాదని వివరించారు చిట్టిబాబు. బాలకృష్ణ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు చెప్పారు. వైద్యనికి తారకరత్న స్పందిస్తున్నా ఇంకా ప్రమాదం అయితే ఉందని కాకపోతే కళ్ళు తెరిచి చూస్తున్నాడు ప్రోగ్రెస్ ఉందంటూ తెలిపారు. ఇక వైసీపీ వాళ్ళు పనిగట్టుకుని రాజకీయం చేస్తున్నారని, అయినా ఇటువంటి విషయాలలో రాజకీయాలు చేయడం ఏమిటి అంటూ విమర్శించారు.
తారకరత్న కుటుంబంలో అందరితోనూ చాలా బాగా కలిసి మెలిసి ఉండేవాడు అందువల్ల ఇప్పుడు కుటుంబం మొత్తం అతనికోసం చూస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాస్పిటల్ ఖర్చు వాళ్ళు కడుతున్నారు వీళ్ళు కడుతున్నారు అంటూ పూటకో న్యూస్ వస్తోంది. అసలు వాళ్ళ కుటుంబ విషయం అది, అతను కోలుకోవాలని కోరుకుంటున్నారు అందరూ. ఇక బిల్స్ బాలకృష్ణ కడుతున్నాడు, చంద్రబాబు కడుతున్నాడు అంటూ వార్తలు ఎందుకు, వాళ్లంతా ఒక కుటుంబం. తారక రత్న తండ్రి మోహన్ కృష్ణ కు డబ్బు లేదా అయితే అందరూ బాధ్యత తీసుకున్నారు, అంత మాత్రాన వాళ్ళు బిల్స్ కడుతున్నారు వీళ్ళు కడుతున్నారు అంటూ న్యూసెన్స్ ఎందుకు అంటూ ఫైర్ అయ్యారు.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…