Producer Chittibabu: మెగా ఫ్యామిలీలో ఇటీవలే రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టింది. ఆనందంలో అభిమానులు మెగా ఫ్యామిలీ ఉండగా అపుడే మరో వార్త బయటికి వచ్చింది. అదే నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోబోతోందని. 2020లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్య తో ఘనంగా వివాహం చేసారు. ఇక పెళ్ళై మూడేళ్ళైనా కాలేదు అపుడే విడాకులు తీసుకున్నారు. ఇటీవలే కోర్ట్ వీరికి విడాకులను మంజూరు చేయగా ఈ ఇష్యూ ఇపుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యూ గురించి సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు మాట్లాడారు.
మెగా ఫ్యామిలీ బాధలో ఉంటే…
నిహారిక విడాకుల విషయంలో మెగా ఫ్యామిలీ బాధలో ఉందని అది వాళ్ళ కుటుంబ విషయం కావున చర్చించుకోవడం కరెక్ట్ కాదని చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. నిహారిక సినిమాల్లో నటించింది, సెలబ్రిటీ కావడం వల్ల ఈ విషయం ఇంతగా సోషల్ మీడియాలో వస్తోంది. కానీ బయట కూడా ఎంతో మంది ఏవేవో చిన్న చిన్న కారణలకే విడిపోతున్నారు.
కోర్టులో నేడు విడాకులకు సంబంధించిన కేసులు చాలానే ఉన్నయి. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అయితే వాటి గురించి మనం మాట్లాడుకోము. వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మాట్లాడుతాం అంటూ చెప్పారు. పెళ్లయ్యాక ఇద్దరి అభిప్రాయలు కలవనపుడు విడిపోవాలని చాలా మంది నేటి తరం అనుకుంటున్నారు. ఇంట్లో ఏవో గొడవలో లేక అత్త మామలో అసలు విడాకులకు కారణం కాదు అంటూ భార్యభర్తల మధ్య అభిప్రాయాబేధాలు వస్తే విడాకులకు వెళ్లిపోతున్నారు అంటూ చిట్టిబాబు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…