Producer J.Radha Krishna Murthi : అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ నటించిన ‘ప్రతిబింబాలు’ సినిమా దాదాపు నలభై ఏళ్ళ తరువాత విడుదలయింది. సినిమా అనేక అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు విడుదల కాగా తాజాగా ఆ సినిమా నిర్మాత వార్తల్లో నిలిచారు. నన్ను మోసం చేసారు డిస్ట్రిబ్యూషన్ పేరుతో అంటూ పోలీసులను ఆశ్రయించారు. సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. అప్పటి పాత చిత్రాన్ని ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సంశయం ఉన్నా నిర్మాత ప్రపంచ వ్యాప్తంగా రెండువందల థియేటర్లలో సినిమాను విడుదల చేశారట.
సినిమా డిస్ట్రిబ్యూషన్ పేరుతో మోసం…
రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ అనే ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు సినిమా డిస్ట్రిబ్యూషన్ పేరుతో 13 లక్షలు నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి వద్ద సినిమా విడుదలకు అని చెప్పి తీసుకొని మోసం చేసారంటూ నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేసారు. డిస్ట్రిబ్యూషన్ కి సంబంధిచిన ఈ నెల 9న రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ లకు ఫోన్ చేయగా వారు స్పందించలేదని వారి డ్రైవర్ బాలు ఈ ఇష్యూలో జోక్యం చేసుకుని దుర్భాషలడాడని చెప్పారు.
అంతే కాకుండా తన ఆఫీస్ కి వచ్చి కత్తితో పొడుస్తామని బెదిరించి ఆఫీస్ నుండి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లిపోయారు, మళ్ళీ తిరిగి ఇవ్వలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు మేరకు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ ల మీద ఐపీసీ సెక్షన్ 448, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…