Producer M.S. Raju : ఒక్కడు, వర్షం, నువ్వొస్థానంటే నేనొద్ధంటానా అంటూ వరుస హ్యాట్రిక్ లు కొట్టిన నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్స్. ఇక ఏంఎస్ రాజు గారు కేవలం నిర్మాత అంటే డబ్బు పెట్టడం అన్నట్లు కాకుండా సినిమా ప్రతి విషయంలోనూ పర్యవేక్షిస్తారు. వరుసగా మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుని రికార్డు క్రియేట్ చేసారు. ‘వాన’ సినిమా తరువాత రాజుగారి దూకుడు తగ్గిపోయింది. ఇక డైరెక్టర్ గా కూడా సినిమాలను తీసిన ఆయన లాక్ డౌన్ సమయంలో ‘డర్టీ హరి’ అంటూ సినిమాను డైరెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం కొడుకు కోసం ఒక సినిమా చేసిన ఆయన తన సినిమా కెరీర్ గురించి మాట్లాడారు.
మహేష్ తో నాకు ఇష్యూ లేదు… సిద్ధార్థ హీరో అంటే అందరూ నవ్వారు…
‘ఒక్కడు’ సినిమా సమయంలో మహేష్ సక్సెస్ లో లేడు, నేను సక్సెస్ లో లేను దీంతో సినిమా బడ్జెట్ విషయంలో మహేష్ ఎక్కువ బడ్జెట్ వద్దని చెప్పాడు. కానీ నేను కంప్రమైస్ అవ్వడం ఇష్టం లేక బడ్జెట్ పెట్టాను. మొదటిసారి డైరెక్టర్ కథతో వెళ్లడం ఒక్కడు సినిమాతో జరిగింది. గుణశేఖర్ కథను మహేష్ వినమంటే విని ఒకే చేసాము. చిన్న చిన్న మార్పులు మామూలే కానీ సినిమా చక్కగా వచ్చింది. వాళ్లిద్దరితో నాకెలాంటి వివాదాలు లేవుఅంటూ వివరించారు రాజు గారు. ఇక ప్రభాస్ తండ్రికి మాటివ్వడం వల్ల వర్షం సినిమా చేసానని, ఆ తరువాత మళ్ళీ ప్రభాస్ ఇంకో సినిమా చేద్దామని అడిగినా ‘నువ్వొస్తానంటే నేనొద్ధంటనా’ ఆల్రడీ రెడీ చేసుకోవడం వల్ల మళ్ళీ చేద్దామని చెప్పాను, ఇక రాజమౌళితో తాను సినిమా కమిట్ అయ్యాడు.
సిద్ధార్థ హీరోగా ప్రభుదేవాను డైరెక్టర్ గా ఆ సినిమా ప్లాన్ చేసాం. సిద్ధార్థ హీరో అనగానే పరుచూరి బ్రదర్స్ ఆ జుట్టు ఏంటి ఆ హీరో అంటూ నవ్వేవాళ్ళు, ఇక పోస్టర్స్ చూసాక చాలా మంది అమ్మాయిలా ఉన్నాడు హీరో ఏంటి అంటూ మాట్లాడారు. ప్రభుదేవా డైరెక్టర్ అనగానే రాజుకి బాగా బలుపు ఎక్కువైంది అందుకే రెండు హిట్లు వెంటనే రాగానే ఇలా ఇష్టమొచ్చినట్లు చేస్తున్నాడని విమర్శించారు. కానీ ఆ సినిమా హిట్ అయ్యాక త్రిషా, సిద్ధార్థ, ప్రభుదేవా కెరీర్ మారిపోయింది అందరూ ముందుకెళ్లిపోయారు. ఆలోచిస్తే నేను మాత్రమే కెరీర్ లో వెనుకబడ్డానేమో అంటూ నవ్వుతూ చెప్పారు ఏంఎస్ రాజు గారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…