Kangana Ranaut: ఇక్కడ పుట్టినందుకు గర్వంగా ఉంది..! షాకింగ్ కామెంట్స్ చేసిన కాంట్రవర్సి క్వీన్!
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో నెపోటిజాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది కంగనా. ఇటు సినిమాలతోనే కాకుండా వివాదాల్లో కూడా ఉంటుంది.
ఇటీవల రైతుల ఉద్యమంపై కొన్నివివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై కొంతమంది మనోభావాలు దెబ్బతినడంతో కేసులు కూడా పెట్టారు. ఇదిలా ఉంటే రాజకీయంగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. జాతీయ భావాలు ఎక్కువగా ఉన్న కంగనా.. బీజేపీకి ఎక్కవగా ఫెవర్ గా ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన పార్టీపై కూడా పలు విమర్శలు చేసింది.
ఇటీవల కంగనా చేసిన తలైవి సినిమా హిట్ అయింది. మరికొన్ని సినిమాలను ప్రస్తుతం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సైతం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ఈ ఫైర్ బ్రాండ్. స్వామి వివేకానందకు జయంతి సందర్భంగా అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది ఈ బ్యూటీ.
ప్రపంచానికి సహనం, సార్వత్రిక ఆమోదం రెండింటినీ బోధించిన మతానికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడం మాత్రమే కాకుండా.. మేము అన్ని మతాలను సత్యం అంగీకరిస్తామని రాసుకొచ్చింది. ఇప్పుడే కాకుండా ఇదివరకు కూడా కంగనా.. వివేకనందుడికి నివాళులు అర్పించారు. అందులో.. ‘నన్ను నేను పోగొట్టుకున్నప్పుడు మీరు నన్ను కనుగొన్నారు. ఇక్కడే ఉండేలా నా చేయి పట్టుకున్నారు. ఏ ఆశలేదని భ్రమపడ్డప్పుడు నాకో పర్పస్ ఉందని గుర్తు చేశారు. నా గురువుగా మిమ్మల్ని మించిన దేవుడు లేడు. నా జీవితం మొత్తం నీకు అంకితం’ అంటూ రాసుకొచ్చింది. గతంలో లవ్ ఎఫైర్ల, బ్రేకప్ లకు సంబంధించి తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు వివేకనందుడి మార్గమే తనను మళ్లీ నిలబెట్టిందనే అర్థంతో ఈవ్యాఖ్యలు చేసి ఉంటుందని నెటిజెన్లు అనుకుంటున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…