UNESCO: హిందీ భాషకు అరుదైన గౌరవం..! ఇక నుంచి యునెస్కో వెబ్సైట్లో హిందీ కూడా..!
UNESCO: హిందీ మన జాతీయ భాష అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు మన భారదేశంలో ఉన్న చాలామంది సగానికి పైగా హిందీ భాషను మాట్లాడుతుంటారు. మన భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా హిందీ మాట్లాడేవారు చాలామంది ఉన్నారు.
తాజాగా హిందీ భాషకు అరదైన గౌరవం దక్కింది. యూనెస్కో (UNESCO ) ప్రపంచ వారసత్వ కేంద్రం వెబ్సైట్లో హిందీ భాషను ప్రచురించడానికి అంగీకరించినట్లు కేంద్రం తెలిపింది. ఇటీవల జాతీయ హిందీ దినోత్సం జరుపుకున్న నేపథ్యంలో యూనెస్కో ప్రధాన కేంద్రం అయిన పారిక్ కు చెందిన భారతదేశ శాశ్వత ప్రతినిధి విశాల్ వీ శర్మ బృందం ఓ వేడుకను నిర్వహించింది.
ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి తెలుసుకొనుటకు ఇక నుంచి హిందీ భాషలో కూడా వివరించేందుకు WHC(వరల్డ్ హెరిటేజ్ సెంటర్) వెబ్సైట్లో ప్రచురించడానికి అంగీకరించరించినట్లు ప్రతినిధి బృందం తెలియజేసింది.
యూనెస్కో తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాదు.. కేంద్ర విద్య , నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇక యూనెస్కో విషయానికి వస్తే.. దీనిని 1945లో స్థాపించారు. దీనిలో సాంస్కృతిక లేదా సహజ వారసత్వానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు దీనిలో లిస్ట్ అయి ఉంటాయి. భారతదేశం 1977లో యునెస్కో సమావేశాన్ని ఆమోదించింది. దీంతో మొదటగా దీనిలో అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, తాజ్ మహల్ మరియు ఆగ్రా కోట వంటివి భారతదేశం నుండి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఇండియా నుంచి మొత్తం 40కి పైగా వారసత్వ ప్రదేశాలు చోటు సంపాదించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…