Pruthvi : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాలో డైలాగుతో బాగా ఫేమస్ అయిన కమెడియన్ పృథ్వీ, చాలా సినిమాల్లో కమెడియన్ గా చేసి అందరినీ నవ్వించారు. ఇక చాలా సీరియస్ గా 2014లో వైసీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరుపున ప్రచారం చేసాడు. అధికారంలోకి వైసీపీ రాగానే పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఛానెల్ ఎస్విబిసి చైర్మన్ గా నియమించి గిఫ్ట్ ఇచ్చింది. అయితే ఆ పదవిని ఎక్కువ రోజులు నిలుపుకోలేక పోయాడు పృథ్వీ.
సిగ్గుండాలి వైసీపీ లోకి వెళ్లే వారికి…
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పదవి కాస్త ఉడిపోయి పరువు పోయింది. నామీద నిందారోపణలు చేస్తున్నారంటు పృథ్వీ చెప్పిన వైసీపీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. తాజాగా పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వైసీపీ నుండి, జనసేనకు జంప్ కొడతాడేమో అనేలా మాట్లాడుతున్నాడు. వైసీపీ నుండి పిలుపొస్తే వెళ్తారా అని అడుగగా ఇక చాలండి… నమస్కారమండి.. అంటాను. వైసీపీ లోకి వెళ్లే వాళ్ళకి సిగ్గు, శరం ఉండాలి. కులం ప్రస్తావన ఎపుడు నేను తీసుకురాలేదు. కానీ మొదటిసారి చెబుతున్నా, తూర్పు గోదావరి జిల్లా చోళ్లంగి గ్రామంలో పుట్టిన కాపు వాడిగా చెబుతున్నా, మా జాతి వాడెవడు ఆ పని చేయడు. అంటూ ఖరాఖండీగా వైసీపీ వైపు వెళ్లనని క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ. ఇక జనసేన గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడంటున్నారు.
నీయమ్మ… 10 సీట్లు కాదు వచ్చే ఎన్నికలలో 40 సీట్లు గెలుస్తాం… జనసేన జండా రాబోయే రోజుల్లో ఎగరబోతోంది నేను రాసిస్తాను.. అని నేను ఘంటాపథంగా చెప్పగలను 2024 ఎన్నికల్లో ఆయనే కింగ్ అంటూ మాట్లాడారు పృథ్వీ. ఇక ఈ మాటలు ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో పృథ్వీ జనసేన లోకి జంప్ అవుతాడు అనే మాటలకు మరింత బలం చేరింది. త్వరలోనే జనసేన ఖండువా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కప్పుకుంటాడన్నమాట.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…