Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు.

చెబితే వెళ్లిపోయేవాడిని, తోసేసారు…
30 ఇయర్స్ పృథ్వీ వైసీపీ నుండి బయటికి రావడం గురించి మాట్లాడుతూ వాళ్ళు నువ్వు వెళ్ళిపో అని చెప్పుంటే దండం పెట్టి నేనే వచ్చేసే వాడిని, ఇంత అపవాదు వేసి నన్ను తీసేయాల్సిన పని లేదు కదా అంటూ మాట్లాడారు పృథ్వీ. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, వాళ్లే జగన్ ను తప్పు దోవ పట్టిస్తారంటూ పృథ్వీ మాట్లాడారు. నేను రెడ్డి కులం కాదు కాబట్టి నన్ను బయటకు పంపేశారు అంటూ విమర్శించారు.

మరి వైసీపీ లోనే అంబటి, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్ మొదలగు వారి విషయంలో ఏం చేసాడు జగన్ మోహన్ రెడ్డి అంటూ పృథ్వీ ప్రశ్నించారు. అయితే జగన్ వల్ల నేను ఒక ఆరు నెలలు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండగలిగాను అంతకంటే ఏం కావాలి అంటూ మాట్లాడారు. సినిమా కుటుంబం నుండి వచ్చిన పవన్ కు సపోర్ట్ గా ఉందామని జనసేనలో చేరినట్లు పృథ్వీ తెలిపారు.



































