Political News

Pulivendula By Elections.. పులివెందులలో ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక.. వైసీపీ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టేనా ?

అమరావతి: గత మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవాలకు పెట్టింది పేరైన పులివెందుల జడ్‌పీటీసీ స్థానం ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో, తొలిసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిజమైన పోటీకి రంగం సిద్ధమైంది.

The by-election in Pulivendula has become prestigious.

ఏకగ్రీవాలకు చరిత్ర

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి వైఎస్ జగన్ వరకు, పులివెందులలో జడ్‌పీటీసీ స్థానాలు ఎప్పుడూ ఏకగ్రీవంగానే దక్కాయి. 1995, 2001, 2006, 2021 ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. 2016లో టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసినా, చివరికి అతడు వైసీపీలో చేరడంతో పోటీ లేకుండా పోయింది. 2021లో వైసీపీ అభ్యర్థి మహేశ్వర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆయన దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ప్రతిష్టాత్మకంగా మారిన పోరు

ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉండటంతో, జగన్‌ కంచుకోటను చేజిక్కించుకోవాలని బలంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు వైసీపీ తమ సొంత గడ్డపై జెండా ఎగరేయాలని కసిగా ఉంది. ఈ ఎన్నికల పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉండగా, టీడీపీకి సుమారు 25% (2,600 ఓట్లు) మాత్రమే ఓటు బ్యాంక్ ఉందని అంచనా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పథకాలతో తాము గెలుస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

కుటుంబానికి టికెట్, సిట్టింగ్ స్థానం కోసం ప్రయత్నం

ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున దివంగత మాజీ జడ్‌పీటీసీ మహేశ్వర రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ టికెట్ ఇచ్చినట్లు వైసీపీ చెబుతోంది. సాధారణంగా మరణించిన నేత కుటుంబ సభ్యులు పోటీలో ఉన్నప్పుడు పోటీ పెట్టకూడదనే టీడీపీ విధానానికి భిన్నంగా, ఈసారి టీడీపీ తమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి సతీమణిని అభ్యర్థిగా నిలిపింది.

ఫలితంపై ఉత్కంఠ

ఈ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రికి కానుక ఇవ్వాలని టీడీపీ శ్రేణులు భావిస్తుండగా, సిట్టింగ్ స్థానాన్ని వదులుకోకుండా గెలవాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. జగన్ అడ్డాలో వైసీపీకి షాక్ తగలబోతుందా, లేక టీడీపీకి మరోసారి నిరాశే మిగలబోతుందా అనేది ఆగస్టు 14న తేలనుంది.

telugudesk

Recent Posts

టీనేజ్‌లోనే కాదు… పెద్దవారిలో కూడా మొటిమల ముప్పు ఎందుకు?

చర్మంపై వచ్చే మొటిమలు చాలా మందికి సాధారణ సమస్యగా కనిపించినా, వాటి వెనుక ఉన్న కారణాలు మాత్రం అంత సులభమైనవి…

15 minutes ago

మామిడి సీజన్‌లో జాగ్రత్త.. రసాయనాల మాయాజాలం బయటపడింది!

వేసవి రాగానే మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. మార్కెట్లలో ఎక్కడ చూసినా పసుపు రంగులో మెరిసే మామిడి పండ్లు కనిపిస్తూ…

16 minutes ago

ఏసీ వాడకం ఎక్కువైందా? చల్లని గాలి వెనుక దాగిన ముప్పులు.. ఏసీతో వచ్చే సమస్యలు ఇవే!

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ చల్లని గాలి కోసం ప్రజలు ఏసీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇంటి నుంచీ కార్యాలయాల వరకు…

45 minutes ago

మోమోస్ ప్రేమికులకు అలర్ట్.. ఇలా తింటే సేఫ్!

ఇటీవల భారతీయ వీధి ఆహారాల్లో మోమోస్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ…

1 hour ago

యాదాద్రిలో సంచలనం.. ఆలయ సరుకుల దుర్వినియోగం ఆరోపణలు!

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రతకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆలయ సరుకుల దుర్వినియోగంపై…

2 hours ago

చల్లదనం కోసం నేచురల్ డ్రింక్స్.. వేసవిలో ఈ జ్యూస్‌లు ట్రై చేయండి!

వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చల్లదనం కోసం సహజ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల…

3 hours ago