Punch Prasad: సర్జరీ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్… ఎమోషనల్ అయిన కమెడియన్!

Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కమెడియన్ పంచ్ ప్రసాద్. ఈయన అద్భుతమైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ప్రతి ఒక్కరిని కడప నవ్విస్తూ ఉంటారు. ఇలా పైకి నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే పంచ్ ప్రసాద్ నవ్వు వెనక ఎన్నో కన్నీటి గాథలు కష్టాలు ఉన్నాయని చెప్పాలి. ఈయన పైకి నవ్వుతూ కనిపించిన ఆరోగ్యం పరంగా తాను ఎంతో నరకం అనుభవించారు అనే విషయం మనకు తెలిసిందే.

రెండు కిడ్నీలు పాడవడంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పంచ్ ప్రసాద తన ఆరోగ్య సమస్యలను కూడా పక్కనపెట్టి ప్రేక్షకులను సందడి చేయడానికి వేదిక పైకి వచ్చేవారు అయితే ఈయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడంతో ఈయనని పరీక్షించిన వైద్యులు తనకు వెంటనే సర్జరీ జరగాలని సూచించారు. ఈ విధంగా పంచ్ ప్రసాద్ కిసర్జరీ చేయాలని చెప్పడంతో నూకరాజు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు.

Punch Prasad: ఎమోషనల్ అయిన ప్రసాద్..


ఇక ఈ విషయం జబర్దస్త్ మాజీ జడ్జ్ ఏపీ మినిస్టర్ రోజా వరకు చేరడంతో ఈమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ప్రసాద్ సర్జరీకి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఇలా సర్జరీ సక్సెస్ అయిన తరువాత ప్రసాద్ దాదాపు మూడు నెలలపాటు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు అయితే ఈయన ఆరోగ్యం కుదట పడటంతో తిరిగి బుల్లితెరపై సందడి చేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసినటువంటి ఈయన తన పరిస్థితిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.