కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను సినీ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటివరకు యాక్టివ్ గా ఉండి, చలాకీగా ఉన్న అతను ఒక్కసారిగా కుప్పకూలడం, ఆ తర్వాత హాస్పిటల్ కి చేర్పించడం, అనంతరం అతను తుది శ్వాస విడిచడం ఇవన్నీ కూడా టకటక జరిగిపోయాయి. ఇప్పటికీ అతను చనిపోయాడు అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు.
అయితే పునీత్ చనిపోవడానికి రెండు రోజుల ముందు కన్నడ స్టార్ హీరోతో కలిసి స్టేజ్ ఫై స్టెప్పులు కూడా వేశారు. ఇటీవలే కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన జై భజరంగి 2 సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం జరిగింది. ఈవెంట్ కు యష్ అలాగే పునీత్ ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఈ సందర్భంగా పునీత్, శివరాజ్ తోపాటు యష్ తో కలిసి స్టెప్పులు వేశారు. ఇక తాజాగా పునీత్ అకస్మాత్తుగా మరణించడంతో ఇన్ని రోజుల క్రితం యష్ తో కలిసి స్టేజి పై స్టెప్పులు వేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూసి అభిమానులు మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ ఎమోషనల్ అవుతున్నారు.
అంతే కాకుండా నిన్న పునీత్ మరణవార్త విన్న అభిమానులు హాస్పిటల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని ఎమోషనల్ అయ్యారు. కొంతమంది అయితే ఈ మరణ వార్త విని గుండెలవిసేలా రోదించారు. ఒకవైపు పునీత్ కుటుంబంలో, మరొకవైపు శాండల్ వుడ్, అలాగే భారత సినీ పరిశ్రమలో ఇతని మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…