సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గంధపుచెక్కల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో
తెరకెక్కుతున్నటువంటి చిత్రం “పుష్ప”. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక జోడీ కట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెంచాయి.
కరోనా రాకముందు ఈ సినిమాను ఆగస్టు 13వ తేదీ విడుదల చేయనున్నట్లు దర్శకుడు అధికారికంగా ప్రకటించారు.అయితే కరోనా కారణం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడింది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారాన్ని చిత్రబృందం వెల్లడించారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కొద్ది రోజులలోనే షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విధంగా సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేశారు. “పుష్ప పార్ట్ 1 ఈ డిసెంబర్ లోనే.. తగ్గేదే లే”అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సుకుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడంతో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో చేస్తూ అల్లుఅర్జున్ కు గట్టి పోటీగా నిలువనున్నాడు. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…