Pushpa: థియేటర్లో ఎక్కువ మంది చూసిన చిత్రంగా రికార్డు సృష్టించిన పుష్ప.. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్!
Pushpa: పుష్ప ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టించింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి విశేషమైన ప్రేక్షకాదరణ పొందిందని చెప్పాలి.
ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడింది.రికార్డుల పరంగా ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించిన పుష్ప తాజాగా మరో రికార్డును కైవసం చేసుకుంది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఎక్కువ మంది ప్రజలు థియేటర్ కి వెళ్లి చూసిన సినిమాలలో పుష్ప సినిమా మొదటి స్థానంలో ఉంది.
ఈ విధంగా పుష్ప సినిమా మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో త్రిబుల్ ఆర్, మూడవ స్థానంలో కేజిఎఫ్ చిత్రాలు నిలిచాయి.పుష్ప సినిమా ఇంత మంది ప్రేక్షకులు చూడటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే కేవలం టిక్కెట్ల రేట్లు మాత్రమే అని చెప్పాలి.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీ విడుదలయినప్పటికీ మన రాష్ట్రంలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే టికెట్ల రేట్లు పెంపు విషయం గురించి ఆలోచించకుండా నిర్మాతలు ఈ సినిమాని విడుదల చేశారు. ఇక టికెట్టు రేటు తక్కువగా ఉండడంతో అత్యధిక మంది జనాలు థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత విడుదలైన త్రిబుల్ ఆర్, కెజిఎఫ్ వంటి సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెరగడంతో మంచి కలెక్షన్లను రాబట్టిన ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాని వీక్షించలేదని తెలుస్తుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…