శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వైద్యులు అతడి ఆరోగ్య బులెటిన్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నారు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. ట్రీట్ మెంట్ కు సాయి ధరమ్ తేజ్ సహకరిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బైక్ రేస్ కారణంగానే అతడు ప్రమాదానికి గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి. సీనియర్ నటుడు కుమారుడు నవీన్, సాయితేజ్ రేసింగ్ పెట్టుకొని డ్రైవింగ్ వెళ్లారనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు.
దుర్గం చెరువు బ్రిడ్జి మీద ఉన్న సీసీ టీవీ పుటేజీని తాము పరిశీలించామని.. అక్కడ కేవలం సాయి ధరమ్ తేజ్ ఒక్కరే వెళ్తున్నారని.. రేసింగ్ అంటూ వస్తున్న వార్తలు పచ్చి అబద్దమని.. వాటిని నమ్మొద్దంటూ.. ఫేక్ వార్తలంటూ కొట్టి పారేశారు. అతడు వెళ్తున్న మార్గంలో అతడి కంటే ముందు ఒక ఆటో మాత్రమే వెళ్తుందని.. దానిని ఓవర్ టేక్ చేసే క్రమంలో అక్కడ ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయి పడిపోయాడంటూ చెప్పుకొచ్చాడు.
తలకు హెల్మెట్ ధరించడంతో తలకు ఎలాంటి దెబ్బలు తగల్లేదని చెప్పాడు. ఆ ఆటోను ఎడమ వైపు నుంచి కాకుండా కుడివైపు నుంచి ఓవర్ టేక్ చేయడంతో ఇలా జరిగిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంపై అతడిపై ట్రాఫిక్ ఉల్లంఘల కింద పోలీసులు రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…