Radhika Apte : రాధికా ఆప్టే చేసింది కొన్ని సినిమాలే అయిన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర, బాలకృష్ణ లెజెండ్ సినిమాలో నటించింది. ఇక తమిళంలో రజనీకాంత్ సినిమాలో నటించింది. ఇక తనకు నచ్చినట్టు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీపై బోల్డ్ కామెంట్స్ చేయటం రాధికా ప్రత్యేకత. బాలీవుడ్ లోనూ బెంగాలీ లోనూ నచ్చిన పాత్రలనే చేస్తూ ప్రత్యేక గుర్తింపుతో దూసుకెళుతోంది.
సర్జరీ ముఖాలను చూడలేక పోతున్నా…..
రాధికా ఆప్టే ప్రస్తుతం సినిమాలను తగ్గించి ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. తాను రీసెంట్ గా చేస్తున్న హిందీ సినిమా విక్రమ్ వేదాలో నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పోలీస్ పాత్రలో, హృతిక్ రోషన్ రౌడీ పాత్రలో నటిస్తున్నారు. తమిళ సినిమా విక్రమ్ వేద సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో రాధిక ఒక కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా రాధికా చేసినా బోల్డ్ కామెంట్స్ తో మరోసారి వైరల్ అయింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్లను సర్జరీ ముఖాలతో చూడలేకపోతున్నా అని ఘాటు వాఖ్యలు చేసింది.
వారి అందం కోసం ముఖానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటే భరించలేకపోతున్నా, బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడే వారే ఇలా చేయడం మరీ విడ్డురంగా ఉండి అంటూ కామెంట్స్ చేసింది. వయసుతో పోటీపడలేక శరీరంతో పోరాడుతున్నారని చెప్పింది. ఇక తనకు రాజీ పడటం ఏ విషయంలోనూ ఇష్టం లేదని చెప్పింది. ఇక రాధికకు ఇలాంటి వాఖ్యలు కొత్తేం కాదు ఇంతకు ముందు కూడా దక్షిణాది సినిమా పరిశ్రమలో హీరోలగురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇక ఈ అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. ఇక ఇపుడు హీరోయిన్ల గురించి చేసిన వాఖ్యల గురించి ఆ హీరోయిన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…