Divyavani: వాళ్లు శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లడిగే రకం.. సీనియర్ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు?
Divyavani:తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి దివ్య వాని ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. కళాకారుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఈమె ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. 2019లో టిడిపి తీర్థం పుచ్చుకున్న దివ్యవాణి పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడ్డారు.
ఈ క్రమంలోనే పార్టీకార్యక్రమాలలోనూ ఎంతో యాక్టివ్గా ఉండే ఈమె తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు. దివ్యవాణి టిడిపి పార్టీలో ఉన్నప్పటికీ తాను ఎంతో క్షోభ అనుభవించానని, రాజీనామాకు ముందే ఆమె పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన తర్వాత పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను పార్టీలో మీకు సరైన న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నలు వేసినప్పుడు లోలోపల ఎంతో బాధను అనుభవిస్తూ తనని తాను కంట్రోల్ చేసుకున్నానని ఈ సందర్భంగా దివ్యవాణి తెలిపారు. ఎలాంటి అధికారం లేని తనకు అధికార ప్రతినిధి అనే పేరు ఇచ్చారని ఈమె తెలిపారు.
పార్టీ కోసం ఎంతో కష్టపడిన పార్టీలో సరైన గుర్తింపు లేదని పార్టీలో సరైన గైడెన్స్ ఇచ్చే వారు లేరని ఈమె వెల్లడించారు.ఎంతో కష్టపడి ఆరోగ్యం బాగా లేకపోయినా ఇంట్లో పిల్లల్ని వదిలేసి హుటాహుటిన మహానాడు కార్యక్రమానికి వచ్చానని, అయితే మహానాడు కార్యక్రమంలో తనకు కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదని వాపోయారు. ఇంటికి వెళ్లి ఎంతో బాధతో ఏడ్చానని ఆ సమయంలో తన పిల్లలు తనని తిట్టారని ఈమె వెల్లడించారు. బహుశా దారిలో నాకు ఏదైనా ప్రమాదం జరిగితే నా శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడిగే రకం అంటూ తెలుగుదేశం పార్టీపై ఈమె అసహనం వ్యక్తం చేశారు.ఇలా తెలుగుదేశం పార్టీ గురించి దివ్యవాణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…