సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం జై భీమ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. దీనిని 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో సినతల్లి ఎదుర్కొన్న కష్టాలను స్పష్టంగా చూపించారు. ఈ చిత్రాన్ని చూసిన సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో తమ స్పందనను తెలుపుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సినిమా చూసి సూర్యకు లేఖ రాయడం విశేషం. అయితే తాజాగా ఈ సినిమా చూసిన నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ చలించిపోయారు. రాజకన్ను, పార్వతి అనే దంపతులను ఆధారంగా చేసుకుని రాజన్న, సినతల్లి పాత్రలను రూపొందించారు. ఒక తప్పుడు కేసు కారణంగా రాజకన్ను భార్య పార్వతి పడిన బాధ హీరో లారెన్స్ దృష్టికి వచ్చింది.
ప్రస్తుతం ఆమె పూరి గుడిసెలో జీవిస్తున్నట్లు తెలుసుకుని చలించిపోయారు. పార్వతికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పార్వతి అమ్మాళ్కి తన స్వంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. లారెన్స్ ప్రకటనతో అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన దాతృత్వానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, లిజోమోల్ జోస్, మణికందన్ తదితరలు కీలక పాత్రలు పోషించారు. సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ నటన అద్భుతం అనే చెప్పాలి. అంతగా డీ గ్లామర్ గా మారి ఆమె ప్రేక్షకులను మెప్పించారు. లాయర్ చంద్రు పాత్రలో హీరో సూర్య జీవించేశాడు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…