Rajamouli : ఈ మధ్య బాలీవుడ్ సినిమాలను అక్కడి ప్రేక్షకులే చూడటం మానేశారు, ఇక సౌత్ వాళ్ళు బాలీవుడ్ డబ్బింగ్ సినిమాలను చూస్తారని ఆశ పెట్టుకోవడం పిచ్చితనమే అవుతుంది. కంటెంట్ బాగుంటే భాషతో సంబందం లేకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు కానీ ప్రస్తుతం వస్తున్న బాలీవుడ్ సినిమాల వైపు అస్సలు చూడటం లేదు. ‘దంగల్’ తెలుగు నాట మంచి విజయాన్ని అందుకుంది. కానీ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను ఆదరించలేదు పైగా సినిమాలో తెలుగు హీరో ఒక పాత్ర పోషించినా పెద్దగా పట్టించుకోలేదు మనవాళ్ళు. ఇక ఇపుడు బాలీవుడ్ లో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ‘బ్రహ్మాస్త్రా’ సినిమా సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను సౌత్ లో కూడా విడుదల చేసి పాన్ ఇండియా సినిమా గా విడుదల చేస్తున్నారు. అందుకోసం ప్రమోషన్స్ ను కూడా బాగా ప్లాన్ చేసారు బ్రహ్మాస్త్రా టీం.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్…
ఇక సినిమా ప్రమోషన్స్ అంటే సౌత్ లో రాజమౌళిని మించి ఎవరు ప్లాన్ చేయరు. ఇపుడు బ్రహ్మాస్త్రా టీం కూడా రాజమౌళి మీదనే ఆధారపడింది. సౌత్ లో సినిమా ప్రేక్షకులకు చేరువ అవ్వడానికి రాజమౌళి ద్వారా ప్రచార కార్యక్రమాలను చేస్తున్నారు. అయితే ఇపుడు బ్రహ్మాస్త్రా టీం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పిలిచింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్రకటించడం తో ఒక్కసారిగా ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండ్ అవుతోంది. రాజమౌళి కి ఎలా సినిమాను ప్రమోట్ చేయాలో బాగా తెలుసు అందుకే ఎవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందో అతన్నే ఈవెంట్ కి ముఖ్య అతిధి గా తీసుకున్నాడు.
ఇక నందమూరి అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు. ఎన్టీఆర్ ను పిలవడం తో సినిమాను తెలుగు ప్రజలకు చేరువ చేసేసాడు జక్కన్న. ఇక మరో వైపు సినిమా ఎవరిదనేది ముఖ్యం కాదు, సినిమాలో కంటెంట్ ఉంటేనే రాజమౌళి ఆ సినిమా ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకుంటాడు లేదంటే అది ఎంత పెద్ద సినిమా అయినా పట్టించుకోడు అంటూ కామెంట్స్ కూడా నెటిజన్స్ నుండి వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికీ బ్రహ్మాస్త్రా ప్రమోషన్స్ కోసం రన్ బీర్ కపూర్ వైజగ్, హైదరాబాద్, అటు చెన్నై అన్ని తిరిగాడు. ఇక ఇపుడు హైదరాబాద్ లో బ్రహ్మాస్త్రా ప్రీ రిలీజ్ గ్రాండ్ గా చేసి హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈసినిమాలో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…