Rajamouli: భారతదేశంలో నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వారిలో రాజమౌళి కూడా ఒకరు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా మారిన రాజమౌళి ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన ఆర్ఆర్ సినిమా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు.
ఇలా ప్రతి సినిమా దర్శకత్వంలో రాజమౌళి తన మార్క్ చూపిస్తూ తన స్థాయిని మరింత పెంచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఆయన దర్శకత్వం వహించిన సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ” తాను పురస్కారాలు, బిరుదులు, అవార్డులు ఆశించి సినిమాలు తీయడం లేదని, కేవలం డబ్బు కోసం మాత్రమే సినిమాలు తీస్తున్నాను అంటూ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాను దర్శకత్వం వహించిన సినిమా ఎంత వసూలను రాబడుతుందని ముందుగా అంచనా వేసుకొని సినిమాలు చేస్తానని ఈయన వెల్లడించారు. అంతే కాకుండా తన దర్శకత్వంలో వచ్చిన సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన తర్వాత ఆ సినిమాకు వచ్చే అవార్డులు రివార్డులను అదనపు ఫలితంగా భావిస్తానని రాజమౌళి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను దర్శకత్వం వహించిన సినిమా ప్రేక్షకులకు నచ్చే భారీ వసూళ్లు రాబట్టడమే తన లక్ష్యంగా వెల్లడించాడు. ఇలా కేవలం వసూళ్లను దృష్టిలో పెట్టుకుని సినిమా చేసినప్పుడు మాత్రమే ఆ సినిమా హిట్ అవుతుందని ఆయన తెలియజేశాడు. అలా కాకుండా కేవలం అవార్డులు, బిరుదుల కోసం సినిమా చేస్తే ఆ సినిమా కోసం కొన్ని వందల కోట్ల బడ్జెట్ కేటాయించిన నిర్మాత అన్యాయం అయిపోతాడు.
ఇలా ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు నష్టపోయి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కనుక తన నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇటువంటి పరిస్థితి ఎదురవకూడదనే ఉద్దేశంతో ఇలాంటి నియమాలు పాటిస్తున్నానని రాజమౌళి వెల్లడించాడు. అయితే కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తానని రాజమౌళీ చేసిన వ్యాఖ్యలపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…