Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చెర్రీ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.
కాగా దిల్ రాజు ఇప్పటివరకు నిర్మించిన సినిమాలలో ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో ఇది 16వ సినిమా. దాదాపుగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు సమాచారం. కోస్తా బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి లయ కూడా నటించనుంది.
ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ఆ మధ్య డైరెక్టర్ బుచ్చిబాబే బిగ్ బాస్ తెలుగు షోలో వెల్లడించాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ సరసన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ అలియాభట్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు ఆర్ఆర్ఆర్ లో కలిసి నటించిన విషయం తెలిసిందే. దాంతో ఆమెను బుచ్చిబాబు సనా అడిగినట్లు ,డిస్కషన్స్ జరుగుతున్నట్లు టాక్. నిర్మాతలు ముంబై వెళ్లి ఆమెతో నెగోషియోషన్స్ చేస్తున్నారని, మాగ్జిమం ఓకే కావచ్చు అని అంటున్నారు.
చరణ్ సరసన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..
ఆర్ఆర్ఆర్ తో ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడిందని, దాంతో స్క్రీన్ పై ఏ ఇబ్బంది లేకుండా ఈ జంట కెమిస్ట్రీ పండుతుందని భావించి దర్శక,నిర్మాతలు ఆమెను అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. అలాగే అదే సమయంలో అలియా కనుక నో చెప్తే సాయి పల్లవి ని సీన్ లోకి తెచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి. కాగా కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారట. ఇంకా ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు రాంచరణ్ పుట్టిన రోజు నాడు అనగా మార్చి 27న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…