సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న.. చరణ్ -శంకర్ సినిమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ తర్వాత రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి కాగానే చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇప్పటికే శంకర్ ఈ సినిమాను ఎక్కడ చిత్రీకరించాలనే విషయాల గురించి ఆలోచించాడని అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెల నుంచి వీరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం వినబడుతుంది. ఎక్కువభాగం ఈ చిత్రాన్ని శంకర్ ఇండియాలోనే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని..ఇండియాలో కూడా ఎక్కువ భాగం తెలంగాణలో చిత్రీకరించే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 8న సినిమా షూటింగ్ ప్రారంభం కాగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది జూలై నాటికి ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబోలో తెలుగులో “వినయ విధేయ రామ” తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. అదేవిధంగా రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే చెర్రీ సరసన నటించారు. ఇక ఆచార్య సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.