Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన నటుడిగా వరుస సినిమాలలో నటించడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో పురస్కారాలు అవార్డులను సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ మరొక అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు.
రామ్ చరణ్ ఇండస్ట్రీకి అందించిన సేవలను గుర్తించినటువంటి చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 13వ తేదీ యూనివర్సిటీలో జరగబోయే స్నాతకోత్సవాలలో భాగంగా రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ డాక్టరేట్ అందుకోబోతున్నారు.
ఈ విధంగా రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇదే యూనివర్సిటీ నుంచి గత కొద్ది నెలల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా డాక్టరేట్ ప్రధానం చేయగా ఆయన ఆ డాక్టరేట్ చాలా సున్నితంగా తిరస్కరించారు.
వేల్స్ యూనివర్సిటీ..
నాకంటే కూడా ఎంతో గొప్పవారు ఉన్నారని తనకు ఇవ్వాల్సిన డాక్టరేట్ వారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈయన తనకు వచ్చినటువంటి డాక్టరేట్ రిజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా అదే గౌరవం లభించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ డైరెక్షన్ లో బిజీ కాబోతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…