Ram Gopal Varma: టాలివుడ్ లో ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆర్జీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆర్జీవీ ఇప్పుడు సరైన అవకాశాలు అందుకోలేకపోతున్నాడు . అయితే ప్రస్తుతం ఆర్జీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినీ ప్రముఖుల మీద రాజకీయ ప్రముఖుల మీద తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అందువల్ల రాంగోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాస్పద దర్శకుడుగా ఇండస్ట్రీలో గుర్తింపు.
ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ టిడిపి నాయకులు టిడిపి అధినేత చంద్రబాబు గురించి కూడా అప్పుడప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా మరొకసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురించి కూడా రాంగోపాల్ వర్మ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజాగా పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ నేల తల్లికి నమస్కరిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనను మనస్ఫూర్తిగా ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే నారా లోకేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ కి రాంగోపాల్ వర్మ స్పందిస్తూ మరొక పోస్ట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో ఆర్జీవీ స్పందిస్తూ..” ఆస్కార్ అవార్డు దక్కాల్సింది రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కాదు … అవార్డు ఖచ్చితంగా నారా లోకేష్ కి దక్కాలి అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నారా లోకేష్ ని ఉద్దేశిస్తూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆర్జీవి చేసిన ఈ ట్వీట్ కి పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…