పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (రామగుండం)లోని కృష్ణానగర్కు చెందిన ఒక కాంట్రాక్టర్కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నరిష్మారెడ్డి (27) ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. నెలరోజుల కిందట అమెరికా నుంచి రామగుండం వచ్చింది. అయితే 20 రోజుల క్రితం ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా..కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు తల్లికీ పాజిటివ్రాగా, ఇద్దరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు.
సరిగ్గా వారం తరువాత మరోసారి టెస్ట్ చేయించగా నరిష్మారెడ్డికి కరోనా నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చింది. నెగటివ్ రిపోర్ట్ వచ్చినా కూడా ఆమె ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడలేదు. దీంతో ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం జాయిన్ చేసారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె కన్నుమూసింది. మంచి ఉద్యోగంతో అమెరికాలో క్షేమంగా ఉన్న కూతురు ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ‘నువ్వు అమెరికాలో ఉన్నా బతికుండే దానివి.. మమ్మల్ని చూడటానికి వచ్చి కరోనాకు బలైపోయావా తల్లీ..’ అంటూ తల్లడిల్లిపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…