Ramcharan: దిగ్గజ నటుడు ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు ప్రస్తుతం హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ అన్ని తానై తండ్రి శతజయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరిపిస్తున్నాడు. హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకలకు సీనియర్ నటినటులకు మాత్రమే కాకుండా ఈతరం కుర్ర హీరో హీరోయిన్లకు కూడా ఆహ్వానం అందింది.
ఇక ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా హాజరయ్యారు.
అలాగే మురళీమోహన్, జయప్రద, జయసుధ, కృష్ణవేణి లాంటి సీనియర్ నటీనటులతో పాటు.. నాగ చైతన్య, సుమంత్, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, రాంచరణ్ లాంటి ఈ తరం నటులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో రాంచరణ్ మాట్లాడుతూ..” తాను 5వ తరగతి చదువుతున్నప్పుడు పురందేశ్వరి గారి అబ్బాయితో కలసి స్కేటింగ్ క్లాసులకు వెళ్ళేవాడిని. ఆ సమయంలో తను ఒకరోజు మా తాతగారి ఇంటికి వెళదాం రా అని పిలిచి నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు అని చెప్పుకొచ్చాడు. అయితే అప్పుడు సెక్యూరిటీ గురించి నాకు తెలియదు. కానీ వెళ్లాను.అక్కడ ఆయన మార్కింగ్ వ్యాయామాలు పూర్తి చేసుకుని పెద్ద చికెన్ పెట్టుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు.
మాకు కూడా చికెన్ వడ్డించారు నేను ఎన్టీఆర్ గారిని చూడడం అదే తొలిసారి అని రాంచరణ్ తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ గారిని తలచుకోకుండా ఉండరు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ.. అప్పట్లోనే ఆయన సౌత్ ఇండియా సత్తాని దేశం మొత్తం చాటారు.. జై ఎన్టీఆర్ అంటూ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…