Ramya Raghupathi : నరేష్ పవిత్ర లోకేష్ ఎపిసోడ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో నరేష్ కృష్ణ గారు మరణించాక పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అది సినిమా ప్రమోషన్లో భాగం అంటూ ఓవైపు కథనాలు వినిపిస్తున్నా నిజానిజాలు ఇంకా తెలియాలి. మరో వైపు తన మూడో భార్యకు నరేష్ విడాకులు ఇచ్చేసాడని తాను డబ్బు తీసుకుని సెటిల్ చేసుకుందనే మాటలు వినిపించాయి. దీంతో ఈ విషయాలన్నింటి మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి రమ్య రఘుపతి తెలుగు యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడి ఆసక్తికర విషయాలను తెలిపారు.

మా మావయ్యతో అక్రమ సంబంధం అంటగట్టాడు…
రమ్య రఘుపతి మాట్లాడుతూ మా విడాకుల కేసు ఇంకా కోర్టులో నడుస్తోందని సెటిల్ అయిపోయిందంటూ ఏవేవో వార్తలు మీడియాలో ప్రసారమవుతుండడంతో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందనే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. రమ్య తన భర్త చెప్పిన ఆపద్దాల గురించి మాట్లాడుతూ తాను ఎపుడు నరేష్ తో కలిసి ఉండలేదని తన భర్త బాగోగులు వఃసుకోలేదని ఆరోపించాడు కానీ నేను హైదరాబాద్ లో నరేష్ తో కలిసే ఉన్నానని వాటికి సంబంధిచిన ప్రూఫ్ లు కూడా నా వద్ద ఉన్నాయంటూ తెలిపారు.

ఇక నన్ను ఇంటి నుండి వెళ్లగొట్టడానికి కృష్ణ గారి పేరు మీద పిటిషనర్ గా కృష్ణ గారిని మరో ముగ్గురుని పేర్కొని ఒక నోటీసు పంపారు. అందులో కృష్ణ గారితో కో హాబిటేంట్ అంటూ పేర్కొన్నారు. నరేష్ ఎంత దిగజారి పోయాడో అక్కడే అర్థమవుతుంది. కొడుకు చనిపోయి భార్య చనిపోయి డిప్రెషన్ లో కృష్ణ గారు ఉంటే ఆయనతో నాకు అక్రమ సంబంధం అంటగట్టి ఆయన నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు అన్నట్లుగా ఆయన సంతకం ఫోర్జెరీ చేసి నోటీసులు పంపారు. ఈ విషయాలన్నీ చెప్పాలని నా కుటుంబ పరువు కృష్ణ గారి పరువు తీయాలనీ అనుకోలేదు కానీ మీడియాలో వార్తలు, జరుగుతున్న వాస్తవాలు వేరనే విషయం చెప్పాలని అనుకున్నట్లు రమ్య చెప్పారు.































