Rashmika: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఊహించని విధంగా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి రష్మిక ఒకరు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే నటి రష్మిక గురించి గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. రష్మిక స్టార్ నటిగా కొనసాగడం కోసం తన ఇంట్లో పూజలు చేయించుకున్నారు అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇకపోతే తాజాగా మరోసారి రష్మిక గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి నటి రష్మిక కెరియర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక త్వరలోనే కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నారు అంటూ ఈయన ఆమె పొలిటికల్ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ విధంగా ఈయన రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది తెలిసిన నెటిజన్స్ కొంచెం స్టార్ డమ్ వస్తేనే రాజకీయాలలోకి రావడం ఏంటి ఇలా రాజకీయాలలోకి వస్తే రష్మిక కెరియర్ పూర్తిగా దెబ్బతింటుంది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి వేణు స్వామి చెప్పిన విధంగానే రష్మిక రాజకీయాలలోకి వచ్చి సినీ కెరియర్ నాశనం చేసుకుంటుందా లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…