Featured

ఫుట్ బాల్ నేపద్యంలో రామ్ చరణ్ ఏ సినిమా ఆగిపోయిందో తెలుసా.?!

చిరుత వేగానికి సమానం ఆయన నృత్య గమనం,ఆయన సాహసానికి మగధీరుడు అనాల్సిందే ఆయన పాటలు వెండితెరపై వస్తుంటే అభిమానులు ఇక రచ్చ రచ్చే. వెండితెర రంగస్థలంపై అతని నటనా కౌశలానికి జేజేలు కొట్టాల్సిందే.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా తో సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ అనతికాలంలోనే ఒక స్టార్ హీరోగా ఎదిగారు.1

సోషియో ఫ్యాంటసీ జోనర్ లో రాజమౌళి తో తీసిన మగధీర సినిమా రామ్ చరణ్ కెరీర్ కి ఎంతగానో తోడ్పడింది.రాజమౌళి విఎఫ్ఎక్స్ మాయాజాలంతో అద్భుతమైన విజువల్ వండర్ గా సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. రాజమౌళి పెట్టుకున్న నమ్మకాన్ని రామ్ చరణ్ పూర్తిగా న్యాయం చేకూర్చడం జరిగింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నాయక్ అనే సినిమాలో నటించాడు. సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆరెంజ్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్ లీ, ధ్రువ, రంగస్థలం లాంటి సినిమాలు చేసినప్పటికీ వీటన్నిటి కంటే ముందే పవన్ కళ్యాణ్ తో తీసిన బంగారం సినిమా దర్శకుడు ధరణి ఫుడ్ బాల్ నేపద్యంలో రామ్ చరణ్ తో మెరుపు సినిమా ప్లాన్ చేయడం జరిగింది.

ఇందులో ఫుట్ బాల్ కోచ్ గా నానాపటేకర్ ను అనుకున్నారు. హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నారు. పీ.సీ.శ్రీరామ్ ను కెమెరామెన్ గా దేవి శ్రీ ప్రసాద్ అన్న సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. ఈ సినిమాకి ‘మెరుపు’ అనే టైటిల్ కూడా అనుకున్నట్టు సమాచారం. కానీ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత బడ్జెట్ ప్రాబ్లం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఒకవేళ సినిమా విడుదలై ఉంటే ఫుట్ బాల్ ప్లేయర్ గా రామ్ చరణ్ ని చూసే అవకాశం అభిమానులు పొందేవారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago