చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల అధిక శరీర బరువును పెరుగుతున్నారు.ఈ క్రమంలోనే శరీర బరువును తగ్గించడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడం కోసం వారి ఆహారంలో కఠిన నియమాలను తీసుకుంటూ ఉంటారు. అయితే శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఎలాంటి కఠినమైన ఆహార నియమాలను పాటించకుండా కేవలం శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల అధిక శరీర బరువును పెరుగుతున్నారు.ఈ క్రమంలోనే శరీర బరువును తగ్గించడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడం కోసం వారి ఆహారంలో కఠిన నియమాలను తీసుకుంటూ ఉంటారు. అయితే శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఎలాంటి కఠినమైన ఆహార నియమాలను పాటించకుండా కేవలం శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
శరీర బరువు తగ్గాలని భావించేవారికి క్యాబేజ్ సూప్ ఒక అద్భుత ఔషధం. ప్రతిరోజు రాత్రి ఈ సూప్ తాగటం వల్ల తొందరగా శరీరంలో క్యాలరీలను తగ్గించుకొని శరీర బరువును తగ్గవచ్చు. క్యాబేజీలో అధికశాతం పోషక విలువలు మనకు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్లు, సోడియం, పొటాషియం, క్యాల్షియం,నియాసిన్, రిబోఫ్లేవిన్, థియామిన్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇన్ని పోషకాలు కలిగినటువంటి ఈ క్యాబేజీని కూర కన్నా, సూప్ చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ సూప్ తయారు చేయడానికి ఒక ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, పచ్చిమిర్చి, నల్ల మిరియాలు, ఉప్పు, క్యాబేజీ తురుముకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద అ అ గోళంలో నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, నల్ల మిరియాలను వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత క్యాబేజీ తురుము వేసి ఒక నాలుగు ఐదు కప్పుల నీటిని వేసి బాగా మరిగించాలి. ఈ మరిగిన నీటిని వడపోసి అందులోకి కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ క్యాబేజ్ సూప్ తాగటం వల్ల శరీరంలోని అధిక కేలరీలు, మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ పెరిగి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది.ఈ విధంగా బరువు తగ్గాలని భావించే వారు వారి డైట్ లో భాగంగా క్యాబేజీ చేర్చడం వల్ల తొందరగా బరువు నియంత్రించుకోవచ్చు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…