Relangi Narasimha Rao : పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు.
వేదికపై నన్ను అవమానించారు…
ఇక రేలంగి గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎక్కువ సినిమాలను తీశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే ఈయన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దోడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తీసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు ముప్పై సినిమాలను చేసారు రేలంగి. రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన ఏ వి ప్రదర్శన జరిగినపుడు ఆయన సినిమా ప్రయాణం లో రేలంగి గారి పేరు ప్రస్తావించలేదట. దీంతో రేలంగి గారు అవమానంగా ఫీల్ అయి అక్కడి నుండి వెళ్లి పోయారట. అయితే వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారి పి ఏ వచ్చి సర్ది చెప్పి కాళ్ళు పట్టుకునేంత పని చేసాడట కానీ రేలంగి గారు వెళ్లిపోయాడట.
జూలో జంతువులను ఆడించినట్లు ఆడిస్తారు…
చలం గారితో సినిమా మొదలు పెట్టి మధ్యలోనే రేలంగి గారు తప్పుకున్నారు. దీనికి కారణాలు అడుగగా మొత్తం అన్ని పనులూ ఆయనే చూసుకుంటారు, డైరెక్టర్ ఆయన కట్ చెప్పమన్నపుడు కట్ చెప్పాలి స్టార్ట్ చెప్పినపుడు స్టార్ట్ చెప్పాలి. ఆయన మనిషే మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మనిషే కెమెరా మాన్ అలా ఉంటారు, విగ్రహ చందంగా డైరెక్టర్ ఉంటాడు. ఆయన జూలో జంతువులను ఆడిస్తుంటే, మనం అలా ఆడాలి. ఇది నచ్చక మూడో రోజే ఆయనకు చెప్పేసాను. నేను ఇలా చేయలేనని చెబితే నా గురించి తెలుసుకుని వచ్చుంటావు అనుకున్నాను అన్నారు. మీరే సినిమా చేయమని అడిగితే వచ్చా మీ మెంటాలిటీ నాకు తెలియదు, నేను చేయలేను అని లెటర్ రాసి వచ్చేసాను అని చెప్పారు.
ఇక హీరోయిన్ జయచిత్ర విషయంలో మాట మాట పెరిగిందని, ఒక సన్నివేశం విషయంలో అలా కాదు అన్నందుకు మీరు చేసి చూపించండి అని అనగా వెంటనే రేలంగి గారు చేసి చూపించారట దీంతో ఆవిడ ఇంకేం మాట్లాడలేదట. మళ్ళీ మూడు రోజుల వరకు మాటల్లేవట, ఇక మళ్ళీ మామూలుగా మాట్లాడటం జరిగాయని రేలంగి గారు అప్పటి విషయాలను పంచుకున్నారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…