Connect with us

Featured

Revanth Vs BRS : రేవంత్, బీఆర్ఎస్.. ఎవరు నెగ్గుతారు? ఎవరు తగ్గుతారు?

Published

on

Advertisement

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అస్తమాను ఢిల్లీ పర్యటన పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్నా హస్తినకు తీసుకెళ్లి మరీ కండువా కప్పిస్తున్నారు. చూసేవారికి కూడా విచిత్రంగా అనిపిస్తోంది. ఏంటిది.. పదే పదే ఢిల్లీకి వెళుతున్నారు.. అసలు తెలంగాణలో పాలన పరిస్థితేంటని అంతా చర్చించుకుంటున్నారు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే హస్తినలో మరోలా ఉందట. రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం క్లాసుల మీద క్లాసులు పీకుతోందట. కారణమేంటంటారా? రేవంత్ చెప్పిందొకటి చేస్తోంది మరొకటని ఏకి పారేస్తున్నారట.. వారానికోసారి ఢిల్లీకి ఈ రాకపోకలేంటని గట్టిగా క్లాస్ పీకేసిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు ఎందుకు రేవంత్‌ను ఏకాల్సిన అవసరం అధిష్టానానికి వచ్చిందంటారా? దానికో ఓ కారణముంది? అధిష్టానం చురకలతో రేవంత్ గట్టిగానే ఫిక్స్ అయ్యారట. ఈ న్యూస్ బయటకు రావడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయిపోయింది. ఏంటిది.. బోడిగుండుకు.. మోకాలుకు ముడిపెడుతున్నారని అనిపిస్తోందా? కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్‌ను తిట్టడమేంటి? ఆయన గట్టిగా ఫిక్స్ అవడమేంటి? దీనికి బీఆర్ఎస్ అలర్ట్ అవడమేంటి? అంటారా? అయితే ఈ కథనం చదవాల్సిందే..

ఒక్కొక్కరి చొప్పున ఎంతకాలం?

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తిన్నది. పార్లమెంటు ఎన్నికల ద్వారా అయినా ఆ దెబ్బలకు కాస్త ఆయింట్‌మెంటు రాసుకుందామంటే.. ఈసారి ఏకంగా చావు దెబ్బే తగిలింది. అంతే.. బీఆర్ఎస్ ఖేత్ ఖతమ్. తెలంగాణలో పత్తా లేకుండా పోయింది. ఇక కేసీఆర్ లక్కీ నంబర్ అయిన ఆరుపై రేవంత్ గురి చూసి మరీ కొడుతున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీల చొప్పున కాంగ్రెస్‌లోకి లాక్కొచ్చారు. కారు పార్టీ ఖల్లాస్ అనడానికి లేదు కానీ రేవంత్ ప్లాన్ మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీ మినహా అందరినీ లాగాలని.. ఈ మంగమ్మ శపథాన్నే ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద చేసి వచ్చారట. వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి లాగిన వారిని ఒక్కొక్కరిని చొప్పున తీసుకెళ్లి కాంగ్రెస్ తీర్థం ఇప్పిస్తుంటే.. ఇచ్చేవారికైనా చిరాకు వస్తుంది కదా.. ఒక్కొక్కరి చొప్పున ఎంతకాలం పోయాలి? అందరినీ పట్టుకురా అంటోందట అధిష్టానం. ఇదీ కథ. బీఆర్ఎస్‌ను ఖతమ్ చేస్తానని శపథం చేసిన రేవంత్.. ఇలా వారానికొకరిని తీసుకెళ్లడం అధిష్టానానికి చిరాకు తెప్పించిందట. అందుకే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట.

Advertisement

కంగుతిన్న రేవంత్..

ఇటీవల రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడే ఖర్గే ఆయనను వాయించి వదిలిపెట్టారని టాక్. అంతకు ముందేమో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తా.. అని ప్రగల్భాలు పలికి వెళ్లావు కదా.. మరి ఏంటిది? అని ప్రశ్నించారట. వారానికొకరిని తీసుకొచ్చి.. షో చేస్తున్నావేంటని ప్రశ్నించారట. విలీనం ఎంత వరకూ వచ్చిందని నిలదీశారట. మొత్తానికి ఈ వ్యవహారంతో కంగుతిన్న రేవంత్ రెడ్డి.. ఇకపై కుంభస్థలాన్నే కొట్టాలని డిసైడ్ అయ్యారట. ఇక తగ్గేదేలే.. మొత్తానికి గాలం వెయ్యాలి.. తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా కప్పించాలని డిసైడ్ అయ్యారట. విషయం కాస్త బీఆర్ఎస్‌కు లీక్ కావడంతో ఆ పార్టీ అలర్ట్ అయిపోయింది. ఇప్పటి వరకూ పోయిన వాళ్లు పోయారు.. ఇక ఉన్నవారినైనా కాపాడుకోవాలని భావిస్తోందట. ఒక్క ఎమ్మెల్యేను కూడా ఇకపై చేజార్చుకోవద్దని బీఆర్ఎస్ గట్టిగా నిర్ణయించుకుందట. మరి ఇద్దరూ గట్టిగానే ఫిక్స్ అయ్యారు. మరి చివరకు ఎవరు నెగ్గుతారో.. ఎవరు తగ్గుతారో చూడాలి. ఈ మొత్తం వ్యవహారం మీద పాలనను గట్టెక్కించకుండా రేవంత్ చూసుకోవాలి. లేదంటే అసలుకే ఎసరు రావడం ఖాయం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!